మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  అన్న చిరంజీవి తర్వాత నట వారసుడిగా వచ్చిన పవన్ కళ్యాన్ కెరీర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా..తమ్ముడు, సుస్వాగతం, తొలిప్రేమ చిత్రాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడు.  ఇక గబ్బర్ సింగ్ తర్వాత పవన్ మాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  అదే సమయంలో జనసేన పార్టీ స్థాపించిన ఆయన ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారంలో మునిగిపోయారు.  పవన్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ ని పెద్దగా మెప్పించలేక పోయింది.  పవన్ కళ్యాన్ తన ప్రసంగాల్లో ఎంతో ఉత్తేజపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు..ఆయనలో మంచి హ్యూమరస్ కూడా ఉంది.  పవన్ కళ్యాన్ ఎంత టెన్షన్ లో ఉన్నా తన ఫామ్ హౌజ్ కి వచ్చి ఎంతో రిలాక్స్ అవుతుంటారు. 

ఫామ్ హౌజ్ లో చెట్ల కు నీళ్లు పోయడం..అక్కడ శుభ్రం చేయడం.. అక్కడ వ్యవసాయం చేయడమే కాదు, గో సేవ కూడా చేస్తుంటారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాల. పవన్ కల్యాణ్, గోశాలలో గో సేవలో మునిగిపోయారు. గోవులకు మేత వేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: