తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రోబో. ఈ చిత్రంతో భారతీయ చలన చిత్ర రంగంలోనే ఓ ట్రెండ్ సృష్టించారు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెస్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సీక్వెల్ గా ఇదే కాంబోలో 2.0 రిలీజ్ అయ్యింది. గత మూడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ ఎన్నో అవాంతరాలను ఛేదించుకొని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. శంకర్ తన చిత్రాల్లో ఎదో ఒక మెసేజ్ ఆడియన్స్ కి అందించడం చూస్తూనే ఉన్నాం.
ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ తో పక్షుల జాతి పూర్తిగా అంతం అవుతుంది..దాన్ని కాపాడేందుకు పక్షి రాజు ఉద్భవిస్తాడు. పక్షిరాజుకి, చిట్టిరోబోకి మద్య జరిగే యుద్దమే 2.0 . ఎపిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. దాదాపు పదివేలకి పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మాత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. కేవలం హిందీలోనే వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది 2.0 చిత్రం.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పక్షి రాజా పాత్రలో కనిపించగా, అమీ వెన్నెల అనే రోబోగా అలరించింది. ఇక రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో కనిపించి అలరించారు. చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిసర్జెన్స్' అనే టైటిల్తో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. 2019 మేలో 2.0 చిత్రాన్ని 10 వేల థియేటర్స్ ( 56 వేల స్క్రీన్స్లో ) విడుదల చేయబోతున్నట్టు లైకా గత ఏడాది డిసెంబర్లో అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.