ఈనెల మార్చ్ 22న విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ నందమూరి తారక రామారావు క్రేజీ సెంటిమెంట్ ను ఫాలో అవ్వడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మార్చి 22న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏప్రియల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. మా సినిమా షో ముహుర్తాన్ని 12 గంటలకు ఫిక్స్ చేశాం’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. 

అంతేకాదు తాను తెలిపిన మార్చి 22  ఏప్రిల్ 11 షో టైమ్ 12 అంకెలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది అని చెపుతూ ఆ అంకెలను అన్నీ కూడుకుంటే 2+2 +1+1+1+2 = 9   ఎన్టీఆర్ లక్కీ నంబర్ 9వస్తుందని వర్మ చేసిన ట్విట్ చూసిన వారికి మరోసారి ఈమూవీ వెనుక నందమూరి తారక రామారావు ఆత్మ ఆశీస్సులు ఉన్నాయా అని అనిపించడం సహజం. నందమూరి తారకరామారావు జీవించి ఉన్నరోజులలో జాతకాలకు ముహుర్తాలకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చిన విష్యం తెలిసిందే. 
బాలయ్య వల్లే లక్ష్మీస్ ఎన్టీఆర్
ముఖ్యంగా సంఖ్యా శాస్త్ర  పరంగా 9 అంకె అంటే రామారావుకు విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే రామారావు ఏకీలక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం 9 సంఖ్య వచ్చే తేదీలో తీసుకునేవారు అని అంటారు. ఇది ఇలా ఉండగా ఈమూవీని ముంబాయికి చెందిన ఎమ్ హెచ్ స్టూడియోస్ సంస్థ ఒక భారీ మొత్తానికి కొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా
ప్రస్తుతం ఈడీల్ కు సంబంధించి చర్చల కోసం వర్మ హడావిడిగా ముంబాయి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఈసినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్నా ఈమూవీ సెన్సార్ కార్యక్రమాల గురించి శ్రద్ధ పెట్టకుండా వర్మ ఈమూవీకి వస్తున్న బిజినెస్ ఆఫర్స్ గురించి శ్రద్ధ వహిస్తున్న నేపధ్యంలో వర్మ వ్యూహాలు ఏమిటి అన్న విషయంమై ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏది ఏమైనా ఈమూవీలో ఎంత వరకు వర్మ వాస్తవాలను ధైర్యంగా తీయగలిగాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: