తెలుగు ఇండస్ట్రీలోకి మామూలు కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి..నటుడిగా కెరీర్ ప్రారంభించారు. పలు చిత్రాల్లో హీరోగా నటించిన లారెన్స్ తర్వాత దర్శకత్వ వైపు యూటర్న్ తీసుకున్నాడు. స్వియ దర్శకత్వంలో ‘ముని’చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పటి వరకు హర్రర్ చిత్రాలంటే భయపడే వారు ఈ చిత్రం చూసి నవ్వుతూనే భయపడే విధంగా థ్రిల్ అందించాడు.
ఆ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది..మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రం సీక్వెల్ గా కాంచన, కాంచన2 చిత్రాలు తెరకెక్కించి మరోసారి వరుస విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం (ముని4 ) గా కాంచన 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళంలలోను భారీ వసూళ్లను రాబట్టాయి. తాజాగా 'కాంచన 3' సినిమాను పూర్తి చేసిన లారెన్స్, ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసేశాడు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్లు గా నటిస్తున్నారు. అయితే కాంచన 3 చిత్రం ఇప్పటి వరకు వచ్చిన సీరీస్ లో కన్నా విభిన్నంగా ఉండబోతుందని లారెన్స్ అంటున్నారు. మరి ఈసారి లారెన్స్ ప్రేక్షకులను ఎలా భయపెట్టి..నవ్విస్తాడో వేచి చూడాలి.