వరస పరాజయాలతో సతమతమైపోతున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ చిత్రలహరి టీజర్ ఫంక్షన్ లో భావోద్వేగానికి లోనైన సాయి ధరమ్ తేజ్ కు సునీల్ అత్యంత సాన్నిహిత్యంతో ఇచ్చిన ఓదార్పు ఆ టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీ ఫంక్షన్ లో సునీల్ మాట్లాడుతూ ఒక్క క్షణం పాటు తన కంటి నుండి వచ్చిన కన్నీరును ఆపు కోవడం స్పష్టంగా కనిపించింది.
ప్రతి శుక్రవారం ట్యూషన్‌కి
ఒక హీరోకి వరసగా ఆరు ఫ్లాప్ లు వస్తే ఆహీరో వైపు చూసే దర్శక నిర్మాతలు అదేవిధంగా ఆహీరోని అభిమానించే అభిమానులు ఉండరనీ అంటూ ఇన్ని ఫ్లాప్ ల తరువాత కూడ తనను ఆదరించే అభిమానులు ఉన్నారు అంటే అది తన అదృష్టం అంటూ తేజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈపరిస్థితిని గమనించిన సునీల్ తేజ్ నుండి మైక్ తీసుకుని తేజ్ ఒప్పుకుంటే తాను అతడితో సినిమాను తీయడమే కాకుండా తానే ఆమూవీకి దర్శకత్వం వహిస్తాను అంటూ కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
దర్శకుడిగా మారుతా
దీనితో ఆకార్యక్రమానికి వచ్చిన చాలామంది షాక్ అవ్వడమే కాకుండా సునీల్ కు దర్శకత్వం చేసే ఆలోచనలతో ఇలా మాట్లాడాడా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. వాస్తవానికి తిరిగి కమెడియన్ గా మారాలని సునీల్ ప్రయత్నాలు చేస్తున్నా అవి కలిసి రాకపోవడంతో ఈవిధంగా ఈ కమెడియన్ తన ఆలోచనలను సాయి ధరమ్ తేజ్ ని అడ్డుపెట్టుకుని అని ఉంటాడు అని కూడ కొందరు అంటున్నారు.
చాలా వెటకారం ఉంది
ఇది ఇలా ఉండగా ‘చిత్రలహరి’ టీజర్ కు మంచి స్పందన రావడం తేజ్ కు జోష్ ను ఇస్తోంది. ఈమూవీలో హీరోయిన్ పాత్ర చిత్రకూ హీరో పాత్ర లహరి కి మధ్య నడిచే ప్రేమ కథను చాల డిఫరెంట్ గా తీయడమే కాకుండా ఈమూవీ కథ నుండి మేకింగ్ వరకు అన్ని విషయాలలోనూ చిరంజీవి సలహా సంప్రదింపులతో జరిగినట్లు ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో చిరంజీవి సూచనలకు అనుగుణంగా ఈమూవీ కథ మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: