తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటించబోతున్నట్టు ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో కనిపించే ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించనుందని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్... 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.