సినీపరిశ్రమలో మీటూ ఉద్యమం కొన్నాళ్లుగా నడుస్తోంది. అప్పుడప్పుడు చప్పబడుతున్నా.. మళ్లీ ఎవరో ఒకరు ఈ వివాదంపై మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మీటూ ఉద్యమంలో హీరోయిన్లు ప్రస్తావించిన బాలీవుడ్ సాజిద్ గురించి కొన్ని విషయాలు చెప్పింది.
తమన్నా ఏమని చెప్పిందంటే.. సాజిత్ పై ఆ ఆరోపణలు రావడం గురించి నేనేమీ చెప్పలేదు.. నాకు స్క్రిప్ట్, సినిమానే ముఖ్యం. నేను సాజిద్తో చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆయన నాతో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయనతో కలిసి పనిచేస్తున్నంతసేపు బాగానే అనిపించింది.
మీటూ కేవలం సినిమా పరిశ్రమకే పరిమితమైనది కాదు. ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి . ‘ముద్దు సన్నివేశాల్లో, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని ఎవ్వరూ బలవంతపెట్టరు. నేను కెరీర్ మొదట్లోనే అలాంటి సన్నివేశాల్లో నటించనని చెప్పేశాను. నాకు ఆ క్లారిటీ ఉంది. ఈ విషయంలో నన్ను ఎవ్వరూ బలవంతపెట్టలేరు.
ఒకవేళ ఫలానా అభ్యంతకర సన్నివేశంలో నటించాలని బలవంతపెట్టారు అని ఎవరైనా చెబితే.. అందులో అర్ధం ఉండదు. ఎందుకంటే ఏదీ మనకు తెలీకుండా చేయం. నచ్చకపోతే వద్దు అని చెప్పి తప్పుకోవచ్చు. ఎవరి నిర్ణయాలు వారివి. ఇక ముంబయి గురించి చెప్పాలంటే నేను ఎంతో కాలం అక్కడ లేను. హిందీలో నేను చేసినవి నాలుగు సినిమాలే. అని చెప్పుకొచ్చింది తమన్నా.