పూజాగాంధీ.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా దండుపాళ్యం. జాలీ దయా లేని దొంగల ముఠా సభ్యురాలిగా  ఆమె ఈ సినిమాల్లో ఇరగతీసింది. నటిగా ఎంత పాపులరో... వివాదల్లోనూ ఆమె అంతే. తాజాగా ఓ హోటల్ వివాదంలో ఆమె చిక్కుకుంది. 

సంబంధిత చిత్రం

బెంగళూరులోని  ఓ లగ్జరీ హోటల్లో బిల్లు కట్టకుండా జంప్ అయ్యిందట. కొన్నాళ్లు ఎదురు చూసిన ఆ హోటల్ యాజమాన్యం ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ హోటల్ బిల్లు కూడా 5 లక్షల వరకూ ఉండటం విశేషం. 

సంబంధిత చిత్రం

చివరకు పోలీసులు పూజాగాంధీని పిలిపించి మాట్లాడాల్సి వచ్చింది. పోలీసుల ముందుకొచ్చిన పూజాగాంధీ.. చేసిన తప్పును చాలావరకూ ఒప్పుకున్నారు. ఐతే.. తాను అసలేమీ కట్టకుండా వెళ్లలేదని.. 2 లక్షలు రూపాయలు కట్టానని పోలీసులకు చెప్పారు.  
సంబంధిత చిత్రం


మిగిలిన 3 లక్షలు కూడా చెల్లిస్తానని.. కాస్త సమయం కావాలని పోలీసులకు చెప్పారు. పూజాగాంధీ దారికొచ్చేసరికి హోటల్ యాజమాన్యం కూడా రాజీకి వచ్చింది. కొద్ది రోజులు సమయం ఇచ్చింది.దీంతో వివాదం సద్దుమణిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: