తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన బయోపిక్ లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రిలీజ్ అయ్యాయి.  ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించారు.  ఈ చిత్రం 29 న రిలీజ్ కాబోతుంది.  ఇక ద‌ర్శ‌కుడు కేతి రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  రాంగోపాల్ వర్మ ఏది చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది.  ఆయన నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన హైప్ తీసుకు వచ్చారు. 

ఈ చిత్రం ఏపి రాజకీయాల్లో ప్రకంపణ సృష్టిస్తుందని..ఎన్టీఆర్ చివరి రోజుల్లో పడ్డ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెరపై చూడవొచ్చని..ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత తన వాళ్లచే ఎలా పరాభవించబడ్డాడో ఈ చిత్రంలో చూడవొచ్చని ఇలా ఎన్నో రకాలుగా చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.  ఇందుకు తగ్గట్టుగానే పోస్టర్లు, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేశాడు.  తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సినిమాపై స్పందించారంటూ, ఓ మార్ఫింగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయమేంటి?" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, ఇది చర్చించాల్సిన అంశమేనని, ప్రతి ఒక్కరూ దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారని, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అంటున్నట్టు వినిపిస్తుంది. తన అభిప్రాయం తనకుందని కూడా ట్రంప్ చెబుతున్నట్టు ఉంది.  మొత్తానికి వర్మ ఎవ్వరినీ వదలడం లేదు కదా..అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: