ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కు 24 కోట్ల పారితోషికం ఇచ్చిన పరిస్థితి ఇండస్ట్రీ చరిత్రలో లేదు. అయితే కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ లో నటిస్తే కంగనకు ఉన్న ఇమేజ్ రీత్యా 24 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసిన విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటూ ఈ రోజు ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 
జాతీయ ప్రాజెక్ట్‌గా జయలలిత బయోపిక్
జయలిత బయోపిక్ ను నిర్మిస్తున్న నిర్మాత విష్ణు ఇందూరి ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. తమిళ దర్శకుడు ఎల్.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ జయలలిత జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలను వాస్తవంగా చూపెట్టి కంగనాకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ రీత్యా జాతీయ స్థాయిలో వందల కోట్ల స్థాయిలో బిజినెస్ చేయాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నారు. 
 కంగన రెమ్యునరేషన్ ఎంతంటే
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి జయలలిత మేనల్లుడు దీపక్ నుండి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న ఈమూవీ నిర్మాతలు రచయిత విజయేంద్ర ప్రసాద్ చేత జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ ను వ్రాయిస్తున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్తుతులలోను చెన్నైలో షూటింగ్ జరుపుకోవడానికి ఆ తరువాత తమిళనాడులో విడుదల చేయడానికి తాము అంగీకరించము అంటూ జయలలిత అభిమానులు ఈసినిమాకు ప్రారంభం కాకుండానే హెచ్చరికలు ఇస్తున్నారు. 
విజయేంద్ర ప్రసాద్ స్టోరీ
ఇప్పటికే మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకున్న కంగనా రనౌత్ జయలలితగా నటిస్తే అది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంచలనం అవుతుంది. ప్రస్తుతం కంగన నటించిన ‘మెంటల్ హై క్యా’ మూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఖాన్ త్రియమ్ హీరోలు పుచ్చుకునే పారితోషికం రేంజ్ లో కంగన పారితోషికం చేరిపోవడంతో ఈమె రేంజ్ ఏస్థాయికి చేరిపోతుంది అన్న సందేహాలు వ్యక్త పరుస్తోంది ఆ ఆసక్తికర కథనం..   

మరింత సమాచారం తెలుసుకోండి: