ఆంధ్రప్రదేశ్ లో నందమూరి ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీని ప్రజలు ఒక దృష్టితోనే చూస్తారు. కేవలం తెలుగుదేశ ప్రభుత్వ భవిష్యత్ ను మాత్రమే కాకుండా నందమూరి ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ శాసించబోతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 
రూ. 19 కోట్లు రావాలి
ఇలాంటి పరిస్థుతులలో ఈవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతూ ఉంటే ఆ మూవీ ఫలితం ఇంకా రాకుండానే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విషయంలో జగన్ తో చేయి కలిపి నేటి నుండి మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాలలో తన పాత్ర పంచుకోబోతున్నాడు. ఈరోజు మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడం మీడియాకు మాత్రమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది.
పదువులపై మోజు లేదు
నందమూరి తారకరామారావుకు వీర భక్తుడుగా చెప్పుకునే మోహన్ బాబు తన అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరాజయానికి తనవంతు పాత్రను పోషించబోతున్నాడు. ఈరోజు మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ తాను నిజాలు చెప్పడం మొదలు పెడితే తెలుగుదేశం అధినాయకుల నవరంధ్రాలు మూసుకు పోతాయని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
ఎవరికీ భయపడను, తప్పు చేస్తే ఆత్మహత్యే
అంతేకాదు తన ప్రాణం పోయే వరకు తాను తలదించుకునే పని చేయనని అయితే అటువంటి పరిస్థితి తనకు ఎదురైతే తాను ఆత్మహత్యకు కూడ వెనుకాడను అంటూ ఈరోజు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది, దీనితో రానున్న ఎన్నికల ప్రచార సభలలో మోహన్ బాబు తన గంభీరమైన గొంతుతో తెలుగుదేశం అధినాయకత్వాన్ని  టార్గెట్ చేయడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: