ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్కు కోర్టు జైలు శిక్ష విధించింది. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరుగా ఉన్న జానీ మాస్టర్ కు జైలుశిక్ష పడటం ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. జానీ మాస్టర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ఉంది.
తెలుగులో ప్రముఖ హీరోలందరితోనూ జానీ మాస్టర్ స్టెప్పులు వేయించాడు. ఔరా అనిపించాడు. కానీ పర్సనల్ కేరీర్ కూ పర్సనల్ లైఫ్ కూ పొంతన కుదరదు కదా.. ఓ ఛీటింగ్ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది.
కొరియోగ్రాఫర్ జానీతో పాటు మరో ఐదుగురిని కూడా జైలుకు తరలించాలని మేడ్చల్ కోర్ట్ ఆదేశించింది. ఈయనపై పెట్టిన కేసులు ఈనాటివి కావు.. నాలుగేళ్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 354, 324, 506 కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చింది. కోర్టు ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది.