పోసాని కృష్ణ మురళి నిర్మిస్తున్న ‘ముఖ్యమంత్రిగారు మీరు మాట ఇచ్చారు’ మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో కమెడియన్ అలీ పోసాని గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆ ఫంక్షన్ కు హైలెట్ గా మారాయి. బయట మీడియా ముందు అలాగే టివి ఇంటర్వ్యూలలో గందరగోళంగా మాట్లాడే పోసాని సినిమా షూటింగ్ ల సమయంలో చాల గంభీరంగా ఉంటాడని కనీసం ఎవరితోనూ మాట్లాడడనీ అంటూ పోసాని గురించి తెలియని విషయాలు బయట పెట్టాడు. 

‘మెంటల్ కృష్ణ’ టైటిల్ తో సినిమా తీసిన పోసాని గురించి తాను గతంలో అతడికి పిచ్చి ఉందా అని అనుకున్న సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ పోసానితో తనకు సాన్నిహిత్యం పెరిగిన తరువాత అతడిలోని గొప్పతనాన్ని గుర్తించడమే తాను అతడి మంచితనాన్ని గుర్తించాను అంటూ పోసాని పై ప్రశంసలు కురిపించాడు. తన కుటుంబం ఆర్ధిక సమస్యలలో ఉన్నప్పుడు కేవలం తన పెన్నును మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చి రచయితగా మాత్రమే కాకుండా నటుడుగా ఎదిగిన పోసానిలోని స్వయం కృషి తనకు ఇష్టం అంటూ కామెంట్ చేసాడు అలీ. 

ఇదే సందర్భంలో గతంలో పోసాని నిర్మాతగా మారి సినిమాలు తీసిన పరిస్థుతులలో ఆసినిమాకు నష్టాలు వచ్చినప్పుడు తన ఇంటిని అమ్మి అప్పులు తీర్చాడు కాని ఎవరికీ డబ్బులు ఎగ్గోట్టలేదు అంటూ పోసాని వ్యక్తిత్వం పై అలీ కురిపించిన ప్రశంసలు ఆ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారాయి. ఎంతోమంది పై సెటైర్లు వేస్తూ ఘాటైన విమర్శలు చేసే పోసాని తన నిజ జీవితంలో ఎంతోమందికి సహాయం చేసిన విషయాలను అలీ బయటపెట్టినప్పుడు ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది ఆశ్చర్యపోయారు.  

ఇదే సందర్భంలో అలీ మాట్లాడుతూ నటుడుగా పోసాని స్థాయి ఏమిటి అన్న విషయం కన్నా ఒక హ్యూమన్ బీయింగ్ గా పోసాని స్థాయి అందుకున్న నటులు చాల తక్కువమంది ఉన్నారు అంటూ అలీ కామెంట్స్ చేసాడు. సాధారణంగా అలీ సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడేడప్పుడు సెటైర్లు ద్వందార్ధాలతో కూడిన పదాలు వాడుతూ ఉంటాడు. అయితే దీనికి భిన్నంగా అలీ చాల గంభీరంగా పోసాని వ్యక్తిత్వం గురించి ఎటువంటి జోక్స్ లేకుండా మాట్లాడటంతో అలీ మారిపోయాడా అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: