ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ రిలీజ్ అయ్యింది. తమన్నా, మెహరీన్లు చిత్రంలో కథానాయికలుగా నటించి తమ గ్లామర్తో ప్రేక్షకులని మెప్పించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంకి మంచి ఆదరణ లభించింది. సంక్రాంతికి కొత్త అళ్లుల సందడి అన్నట్లు ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే.
ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెద్ద చిత్రాల సరసన రిలీజ్ అయిన ఎఫ్ 2 అనూహ్య విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్ తీసే పనిలో పడ్డారు దర్శక, నిర్మాతలు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రిమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. బోణి కపూర్ సహాయంతో స్టార్ సెలబ్రేటిస్ ను సెలెక్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించాలని ప్లాన్స్ జరుగుతున్నాయి.
అనీస్ బజ్మీ ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ధారులుగా ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.ఇక కోలీవుడ్ - మలయాళం భాషల్లో కూడా F2 రీమేక్ కు పలువురు స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.