ఈరోజు ఏప్రియల్ ఫస్ట్ కావడంతో ఈరోజును విదేశాలలో ఫూల్స్ డేగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఎవరైనా మరొకరిని ఫూల్ చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో సరదా పొందుతారు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా రాజశేఖర్ దంపతులు ఈరోజు మరో రాజకీయ పార్టీ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటి వరకు రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ బిజెపి పార్టీలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఎన్నికల వాతావరణం క్లైమాక్స్ కు వచ్చిన సమయంలో వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈసందర్భంలో రాజశేఖర్ మీడియా తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కొంత షాకింగ్ గా ఉన్నాయి. 

గతంలో తనకు పరిపక్వత రాకపోవడంతో చిరంజీవి పై విమర్శలు చేశానని అదేవిధంగా జగన్ పై కూడ విమర్శలు చేశానని అయితే ఇప్పుడు తనకు పరిపక్వత ఏర్పడటంతో తాను సరైన నిర్ణయం తీసుకుని జగన్ ను కలిసి తన అభిప్రాయాలను మార్చుకోవడమే కాకుండా జగన్ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేస్తూ జనంలోకి వెళ్ళి ప్రచారం చేయబోతున్న విషయాలను వివరించాడు రాజశేఖర్. 

ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అతడు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రులకు భద్రత లేదు అంటూ చేసిన కామెంట్స్ ను తాను ఖండిస్తున్న విషయాలను వివరించాడు. దీనితో రాజశేఖర్ రాబోతున్న పది రోజుల్లో రాజకీయాలలో బాగా బిజీగా ఉండబోతున్న సంకేతాలు ఇస్తున్నాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటికైనా రాజేఖర్ కు పూర్తి పరిపక్వత వచ్చిందా లేదా అన్న విషయం ఆయనకే తెలియాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: