తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర లాంటి బయోపిక్ చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ లో సైతం పలు బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా భారత దేశంలో అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని ఎన్నో భాషలు అనయన అనర్గలంగా మాట్లాడగలరు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించారు.
తాజాగా ఆయన జీవిత కథ ఆధారంగా ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్ విత్ కంటిన్యుటీ’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించారు.
పి.వి.నరసింహారావు విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. అంతే కాదు తన జీవితంలోకి రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ‘ఇన్సైడర్’ (లోపలి మనిషి) పేరుతో ప్రచురించారు. 1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వర్ణించారు. జూన్లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు.