సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను అర్ధం చేసుకోవడం దేవుడికి కూడా కష్టసాధ్యం అయిన పని అనుకోవాలి. ఆయన మాటలు, చేతలు చాలా విచిత్రంగా ఆయన తీసే సినిమాలుగానే ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ కు సంబంధించిన ఒక ఆశక్తికర కధనం ఈమధ్య ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఈమధ్య వర్మ దర్శకుడు, నిర్మాత మధురా శ్రీధర్ కు ఏదో ఒక వ్యక్తిగతమైన పని విషయమై ఫోన్ చేశాడట. మధురా శ్రీధర్ సెల్ ఫోన్ కు కాలర్ టోన్ గా ‘ఓం సాయి..ఓం నమో సాయి..ఓం నమో నమో సాయి..నీ పేరు తలచిన చాలు..నా మనసు పరవశించు..నీ రూప దర్శనంతో నా జన్మ తరించు..’ అనే పాట వినిపించిందట. ఆ తరువాత ఆ ఫోన్ ను లిఫ్ట్ చేసిన మధురా శ్రీధర్ తో వర్మ తనకు కావలసిన ముఖ్య విషయాలు అన్నీ మాట్లాడి, చివరగా తన ఫోన్ లో కాలర్ టోన్ గా వినిపించిన పాట ఏ సినిమాలోనిది అంటూ మన టాప్ డైరెక్టర్ ప్రశ్నించాడట.

దానికి మధురా శ్రీధర్ సమాధానం ఇస్తూ, అది సినిమా పాట కాదని, ఒక ప్రముఖ ఆడియో కంపెనీ విడుదల చేసిన సాయిబాబా పాటల ఆల్బమ్ లోనిది ఈ పాట అంటూ సమాధానం ఇచ్చాడట శ్రీధర్. ఆ సమాధానం విన్న తరువాత వర్మ ఆగకుండా ఈ పాట చాలా బాగుంది అంటూ ఆ పాటలోని సాయి పదాన్ని తీసివేసి వేరుగా ఉపయోగించుకుంటే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కు పల్లవి దొరికినట్లు అవుతుందని వర్మ జోక్ చెయ్యడంతో భక్తిపాటలలో కూడా బూతు శబ్దాలు వెతుక్కొనే రామ్ గోపాల్ వర్మ సంస్కారాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏమీ అనలేక ఫోన్ పెట్టేశాడట. భక్తిలో కూడా రక్తిని చూడగలిగిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ కాబట్టే తన హీరోయిన్స్ ను చాలా హాట్ హాట్ గా చూపెడుతూ దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ అనిపించుకుంటున్నాడు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: