తెలుగు ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆ మద్య అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని ఫ్యామిటీ మెంబర్ గా మారిపోయింది. వివాహానంతరం సమంత నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవడంతో ఆమెకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి.
పెళ్లైన తర్వాత సమంత, నాగ చైతన్య జంటగా నటిస్తున్న ‘మజిలీ’ చిత్రంతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ విపరీతంగా చేస్తున్నారు. తాజాగా సమంత తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన ఏడుకొండలు ఎక్కింది. నాగచైతన్య-సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం యూనిట్ తిరుమల చేరుకుంది. అయితే సమంత మాత్రం సామాన్య భక్తులతో కాలి నడకన కొండపైకి చేరుకుంది. తమతోపాటు నడుస్తున్న భక్తులు సమంతను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమెతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. తాజాగా సమంత మెట్ల దారిలో కొండపైకి వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.