‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ కలెక్షన్స్ పరంగా తన హవాను కొనసాగిస్తున్న నేపధ్యంలో ఈ మూవీలో  చూపించిన వాటిలో కొన్ని మాత్రమే వాస్తవాలని చాలా విషయాలు తప్పుగా చూపించారని ఎన్టీరామారావు కుటుంబానికి సన్నిహితంగా ఉండే డాక్టర్ కుసుమ ఎన్. రావు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. 

‘మేజర్ చంద్రకాంత్’ సినిమా సమయంలో ఎన్టీరామారావుకు పక్షవాతం వచ్చిన మాట నిజమే అంటూ అంతకు ముందే లక్ష్మీ పార్వతి జీవిత చరిత్ర రాస్తానని చెప్పి రామారావు వద్దకు చేరిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఆరోగ్యం బాగోలేని సమయంలో లక్ష్మీ పార్వతి దగ్గరుండి చూసుకున్న మాటవాస్తవం అని అంటూ ఒక డాక్టర్‌గా ఆ విషయాన్ని  తాను అంగీకరిస్తాను అంటూ కామెంట్స్ చేసారు. అయితే ఆరోగ్యం బాగోలేనపుడు ఎవరు మనల్ని బాగా చూసుకుంటే వారిపై మనకు అభిమానం ఏర్పడుతుంది అని అంటూ అలంటి అభిమానమే రామారావుకి లక్ష్మి పార్వతి పై ఉన్న విషయాన్ని ఆమె గుర్తుకు చేసుకున్నారు. 

ఆ అభిమానంతో రామారావు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని ప్రజలు యాక్సెప్ట్ చేయడంతో ఆ విషయాన్ని   అలుసుగా తీసుకుని  లక్ష్మీ పారవతి ఎన్టీఆర్ ను అనేక విషయాలలో ఇబ్బంది పెట్టిన విషయాలు తనకు తెలుసు అంటూ డాక్టర్ కుసుమ తెలిపారు. లక్ష్మీ పార్వతి తన కొడుకును దత్తత తీసుకోవాలని ఎన్టీఆర్ మీద చాలా ఒత్తిడి  చేసినా అప్పట్లో ఎన్టీరామారావు ఒప్పుకోలేదని దానితో అప్పటికే పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మీ పార్వతి మళ్లీ తిరిగి పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకున్న విషయం తనకు తెలుసు అంటూ ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు కూడా తనకు తెలుసు అన్న సంచలన విషయాన్ని డాక్టర్ కుసుమ బయటపెట్టారు. 

అంతేకాదు ఎన్టీఆర్ ద్వారా పిల్లలను కనేందుకు లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిన విషయాలు తనకు తెలుసు అంటూ అయన ఆఖరి సమయంలో లక్ష్మీ పార్వతి  సరిగ్గా చూసుకోకుండా ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన విషయాలు కూడ తనకు తెలుసు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.  అంతేకాదు తన దృష్టిలో  ఎన్టీరామారావు  మామూలు వ్యక్తి కాదని నందమూరి తారకరామారావు భార్య అనే హోదా లభించడమే లక్ష్మిపార్వతికి పెద్ద వరం అంటూ ఆవరాన్ని లక్ష్మి పార్వతి దుర్వినియోగం చేసుకున్నారు అంటూ డాక్టర్ కుసుమ చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: