ఈ మద్య కాలంలో మోహన్ బాబు పై వార్తలు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య తన విద్యా సంస్థకు సంబంధించి ఫీజు రియాంబర్స్ మెంట్ రెండేళ్లు పెండింగ్ ఉందని..ఏపి సర్కార్ పై రోడ్డెక్కి నిరసన తెలిపారు.  ఆ తర్వాతతన కుమారుడు మంచు విష్ణుతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న మోహన్ బాబు కి జైలు శిక్ష అంటూ వార్తలు గుప్పుమన్నాయి..చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్ట్ ఆయనకు శిక్ష విధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.


కానీ ఆయన తన ఇంట్లోనే ఉన్నానని..మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని కొట్టి పడేశారు.  తాజాగా  మోహన్ బాబుకి గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత నెల 26వ తేదీ నుంచి పలు నెంబర్ల నుంచి తనను మానసికంగా దెబ్బ తీసే విధంగా ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


అయితే ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: