తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.  బాహుబలి సీరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  అయితే పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నారు.  చిరు కి జోడీగా నయనతార నటిస్తుంది. 

మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రానికి  సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో అతిథి పాత్రలో నిహారిక కనిపించన్నారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.  చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ షూటింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నారు.

జపాన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి చిరు సతీమణి సురేఖ వెళ్లారు. తన తల్లిదండ్రులు విరబూసిన సకురా పువ్వుల అందాల్ని తిలకిస్తున్నారంటూ సుస్మితా కొణిదెల ట్వీట్‌ చేశారు.   ఈ సందర్భంగా మౌంట్‌ఫుజీలో చిరు, సురేఖ కలిసి దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: