గాజువాకలో పవన్ గెలుపు ఇంచుమించు ఖాయం అన్న సంకేతాలు వస్తున్న నేపధ్యంలో పవన్ తన దృష్టి అంతా ఎన్నికలకు సంబంధించి చివరిరోజుల ప్రచారం పై నిలిపి అన్ని ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. పవన్ ఇప్పటి వరకు గాజువాకలో ఒక భారీ రోడ్ షోతో పాటు ఒక భారీ బహిరంగసభ కూడ నిర్వహించి ఫ్యాన్స్ లో జోష్  నింపాడు. దీనికితోడు ప్రస్తుతం గాజువాక ప్రచారంలో పవన్ మిగతా రాజకీయపార్టీల అభ్యర్ధుల కంటే ముందుకు దూసుకుపోతున్నట్లు వార్తలు రావడం అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది. 

ఇది ఇలా ఉఇండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికి అనేకసార్లు విశాఖ వచ్చినా గాజువాక వైపు తొంగి చూడకపోవడంతో పవన్ విజయానికి పరోక్షంగా చంద్రబాబు కూడ సహకరిస్తున్నరా అన్న సందేహాలు కలుగు తున్నాయి.  ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత  జగన్ ఇవ్వబోతున్న లాస్ట్ పంచ్ పవన్ అభిమానులకు కలవరం కలిగిస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అయ్యే చివరిరోజు అంటే ఈనెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గాజువాక టూర్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోజున గాజువాక హోరెత్తించేలా భారీ రోడ్డు షోను నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఆరోజుతో ప్రచారం మొత్తం పూర్తి అవుతుంది. దానితో పవన్ పై లాస్ట్ పంచ్ జగన్ దే అంటూ వార్తలు వస్తున్నాయి. 

పవన్ ‘గబ్బర్ సింగ్’ లోని డైలాగ్ ‘లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరబ్బా’ అనే డైలాగ్ ను పోలి ఉండే జగన్ సుడిగాలి పర్యటన పవన్ విజయానికి బ్రేక్ వేస్తుందా అన్న సందేహాలు పవన్ అభిమానులకు కలుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ పోటీ చేస్తున్న గాజువాక భీమవరం స్థానాలలో పవన్ జయాపజయాల పై ఏకంగా కోట్ల రూపాయలలో పందాలు అన్ని చోట్ల జరుగుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: