తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు తన గాత్రంతో ఓ రేంజ్ కి తీసుకు వెళ్లిన నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నటించిన చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా ఆది హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ’జోడి‘ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో కథానాయికగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు.ఈరోజు ఉగాది పండగను పురస్కరించుకుని కాసేపటిక్రితం ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ ని వదిలారు. పోస్టర్ని బట్టి చూస్తుంటే చిత్రం రొమాంటిక్ మూవీగా తెరకెక్కనున్నట్టు అర్ధమవుతుంది.
ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించనున్నాడట దర్శకుడు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేష్ గుర్రం మరియు పద్మజ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే దసరాకు ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.