తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 చిత్రం తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ  చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఉగాది పర్వదినం సందర్భంగా మొదలైన ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హీరో శర్వానంద్ హాజరయ్యాడు.  పెళ్లి తరువాత ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది అక్కినేని సమంత.


నిన్న రిలీజ్ అయిన ‘మజిలీ’ లో నటనపరంగా మార్కులు కొట్టేసింది. మంచి పాత్ర ఉంటే చాలు.. పెద్ద హీరో చిన్న హీరో అనే తేడాలేకుండ చిత్రాలకు ఓకే చెప్పేస్తుంది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి  ‘జాను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.


తమిళంలో 96గా వచ్చిన ఈ చిత్రంలో… త్రిశ, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అయితే ఈ కార్యక్రమానికి  హీరోయిన్ సమంత మాత్రం హాజరుకాలేదు. మొదటి షాట్ ను శర్వానంద్ పై చిత్రీకరించగా.. వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టాడు. ప్రేమ్ కుమార్ ఈ చిత్రం దర్శకత్వం వహిస్తాడు.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇది 34వ చిత్రం. త్వరలోనే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: