సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ అయిన 25వ సినిమాగా తెరకెక్కుతోన్న మహర్షి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మహర్షిని మే 9న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఇక మహర్షి రిలీజ్కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమాకు కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.
వరల్డ్వైడ్గా ఓవరాల్గా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 100 కోట్లకు అమ్ముడవ్వగా నాన్ థియేట్రికల్ హక్కులు రూ. 45 కోట్లకు అమ్ముడయ్యాయట. మొత్తం 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో బాహుబలి తరువాత అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రెండవ సినిమాగా మహర్షి రికార్డులకు ఎక్కింది.
ఓవరాల్గా చూస్తే ఈ సినిమా సేఫ్జోన్లోకి రావాలంటే రూ.100 కోట్లకు పైగా షేర్ను మహేష్ బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టాల్సి ఉంటుంది. మహేష్ భరత్ అను నేను సినిమా రూ. 90 కోట్ల షేర్ వద్ద ఆగింది. ఈ సినిమాకు అనుకున్న రేంజ్లో లాభాలు రాలేదు. మరి మహర్షి ఏం చేస్తుందో ? చూడాలి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.