తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్దం అయ్యారు దర్శకధీరుడు రాజమౌళి.  తెలుగు ఇండస్ట్రీలో టాప్ మీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’రూపొందిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం 1920 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా..పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కోమురం భీమ్ ల కథానేపథ్యంలో ఉండబోతుందని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు రాజమౌళి.  అయితే అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. 

రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ  డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.  ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం వేట మొదలైంది. బాలీవుడ్ హీరోయిన పరిణితి చోప్రాను తీసుకుంటారని ఆ మద్య వార్తలు వచ్చినా..తాజాగా తెరపైకి మరో పేరు వినిపిస్తుంది.  బాలీవుడ్ లో గ్లామర్ తో కనిపిస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకొని నటిస్తున్న నటి శ్రద్దా కపూర్. 

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన ‘సాహూ’చిత్రంలో నటిస్తుంది. పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె 'చిచ్చోరే' .. 'స్ట్రీట్ డాన్సర్' సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి. ఎలాగైనా ఆమె డేట్స్ సర్దుబాటు చేసి ఈ చిత్రంలో నటింపజేయాలని ‘ఆర్ఆర్ఆర్’చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: