ఒకప్పుడు భారతీయ చలన చిత్ర రంగంలో తన అందాలతో ఎంతటి వారినైనా మంత్ర ముగ్దులను చేసింది అతిలోక సుందరి శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె తర్వాత హీరోయిన్ గా మారి అగ్ర నటుల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి గత ఏడాది దుబాయ్ లో అనుకోకుండా మరణించిన విషయం తెలిసిందే. ఆమె తన ఇద్దరు కూతుళ్లు జాన్వి, కుషీ కపూర్ లను హీరోయిన్లుగా చూడాలనుకున్నా ఆ కోరిక తీరక ముందే చనిపోయింది.
ఆమె చనిపోయిన తరువాత జాన్వి కపూర్ నటించిన ధడక్ చిత్రం రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇటీవల ముంబాయిలో ఓ షాపింగ్ చేసి వస్తున్న ఖుషీ కపూర్ ని చూడగానే అక్కడ ఎంతో మంది అభిమానులు ఆమెను చుట్టు ముట్టారు.
సెల్ఫీల దాడికి నో చెప్పలేక కాస్త ఇబ్బంది పడింది. ఇక ఆమెతో పాటు ధఢఖ్ హీరో ఇషాన్ ఖతార్ అభిమానుల ధాటికి తట్టుకోలే పోయాడు. ఖుషి కపూర్ ముంబై వీధిలో సమ్మర్ హాట్ డ్రెస్ లో దర్శనమివ్వడంతో కుర్రాళ్లంతా ఆమె పక్కనే చేరి ఆమెతో సెల్ఫీకి ఎగబడ్డారు. ఎలాగో అలా కష్టపడి అక్కడ నుంచి బయట పడ్డారు. తాజాగా ఖుషీ కపూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.