స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఏవిధంగా భారీసంఖ్యలో ఉంటున్నారో వారిని టార్గెట్ చేసే యాంటీ ఫ్యాన్స్ సంఖ్య కూడ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఒక్క లీక్ వచ్చినా ఆసినిమాకు సంబంధించి ఏ ఒక్క స్టిల్ విడుదల అయినా వాటి పై కామెంట్స్ మోత మ్రోగి పోతోంది. ఇలాంటి పరిస్థితులలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ పై మహేష్ యాంటి ఫ్యాన్స్ వేస్తున్న సెటైర్లు హాట్ టాపిక్ గా మారిపోయాయి. 

ఈసినిమాకుసంబంధించిన ‘ఎవరెస్ట్ అంచున’ అనే పాట వీడియో ప్రోమోను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ ‘మహర్షి’ యూనిట్ వర్గాలు  ఒక పోస్టర్ వదిలారు. అందులో మహేష్ బాబు జిగేల్ జిగేల్‌ ‌మనిపించే డ్రెస్సుతో  వెలుగు జిలుగుల మధ్య నిలబడ్డాడు. దీనితో మహేష్ డ్రెస్సింగ్ పైన మాత్రమే కాకుండా ఈ పోస్టర్ లో మహేష్ నిలబడిన తీరుపై కూడ సెటైర్లు పడుతున్నాయి. 

మహేష్ నిలబడ్డ తీరులో డైనమిజమ్  లేకపోవడం మహేష్ ముఖంలో కూడా ఏ ఎక్స్‌ ప్రెషన్ లేకపోవడంతో మహేష్‌ ను చూస్తున్నట్లు కాకుండా ఆమధ్య హైదరాబాద్ కు వచ్చిన మహేష్ మైనపు విగ్రహం లా కనిపిస్తోంది అంటూ కొందరి సెటైర్లు వేస్తున్నారు.  గతంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా కుసంబంధించి మహేష్ పై ఇలాంటి సెటైర్లు పడ్డాయి. ఆతరువాత వచ్చిన ‘స్పైడర్’ మూవీలోని మహేష్ లుక్ పై కూడ సెటైర్లు పడ్డాయి.  

అయితే ‘భరత్ అను నేను’ మూవీలోని మహేష్ లుక్ పై యాంటీ ఫ్యాన్స్ కూడ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేకపోయారు. అయితే ఇప్పడు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మహర్షి’ విజయానికి సంబంధించిన ఫోటోలపై కొందరు ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ అందించిన రెండు పాటలు పెద్ద గా క్లిక్ కాని నేపధ్యంలో ఈరోజు విడుదలకాబోతున్న  మూడువపాట ‘ఎవరెస్ట్ అంచున’ పాట వీడియో ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: