ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ఇక కేవలం 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఎన్నికల ఫలితాల పై ఇంకా వాడివేడి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈఎన్నికలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపు గురించి అదేవిధంగా అతడి ‘జనసేన’ కు పడే ఓట్ల శాతం గురించి ఆసక్తికర కథనాలు వస్తూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో సిపిఐ పార్టీ ప్రముఖ నేత రామకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి జరిగిన భారీ కుట్రకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాక స్థానాలలో పవన్ ఓటమి కోసం కొందరు భారీ కుట్ర చేశారనీ అంటూ పవన్ వ్యతిరేకంగా ఓటు వేయండీ అంటూ ఒకప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు ఓటుకు 3 వేలు ఇచ్చారనీ అంటూ రామకృష్ణ మరో కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టడంతో పవన్ అభిమానుల మధ్య టెన్షన్ మొదలైంది. 

ఇది ఇలా ఉంటే ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక లేటెస్ట్ గా ప్రచురించిన కథనంలో ఆంధ్రప్రదేశ్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనీ పవన్ ‘జనసేన’ కు సుమారు 15 స్థానాల వరకు వస్తాయని ప్రచురించిన కథనం ఎంతవరకు వాస్తవం అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలో ఈనాడు మీడియా సంస్థ నిర్వహించిన రహస్య సర్వేలో కూడ ‘జనసేన’ కు కీలకంగా ఓట్లు పడ్డాయన్న విషయాన్ని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. 

దీనితో పవన్ చీల్చిన ఓట్లు ఏపార్టీవి అన్నవిషయమై తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడ అంతు చిక్కడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మొట్టమొదటిసారి ఓటు వచ్చిన వారు అంతా వేసిన ఓట్లు పవన్ జగన్ ల మధ్య చీలిపోయాయి అని వస్తున్న అంచనాలు ఏపార్టీకి మేలు చేస్తాయి అంటూ జరుగుతున్న చర్చలు ఎన్నికల ఫైలితాలు వచ్చేదాకా ఇలా రాజకీయనాయకులకు టెన్షన్ పెడుతూనే ఉంటాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: