తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన నటి రాధిక శరత్ కుమార్. గత వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఎన్నో అద్బుతమైన సీరియల్స్ లో నటించింది రాధిక. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా మలయాళ స్టార్ మోహన్లాల్తో ఓ చిత్రంలో నటిస్తుంది.
ఈ చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘ఇత్యమాణి: మేడ్ ఇన్ చైనా’. ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. హనీ రోజ్ ఇందులో మోహన్లాల్ సరసన నటిస్తున్నారు. తాజాగా మోహన్ లాల్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని..అంత గొప్ప మనిషితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాట్లు తెలిపారు.
సినిమా కోసం మోహన్లాల్తో కలిసి వెండితెరను పంచుకోవడం గౌరవంగా, గర్వంగా ఉంది. ‘సినిమాకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, మీరు లేకపోతే ఈ స్క్రిప్టును సినిమాగా తీయలేం’ అని ఆయన చెప్పడం ఇంకా గర్వంగా ఉంది. ధన్యవాదాలు సర్ అని రాధిక ట్వీట్ చేశారు.