కీర్తి సురేశ్.. అప్పటివరకూ అందాల హీరోయిన్‌ గానే పరిచయం ఉన్న ఈ హీరోయిన్ మహానటితో నిజంగానే మహానటి అనిపించుకుంది. ఐతే.. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ ఈ అమ్మడు హీరోయిన్ గా ఓ తెలుగు సినిమా పూణే లో షూటింగ్ జరుపుకుంటోందట. 


ఈ సినిమాకు నగేశ్ కుకునూర్  దర్శకత్వం వహిస్తున్నారట. ఈయన గతంలో 'హైదరాబాద్ బ్లూస్' .. 'ఇక్బాల్' వంటి చిత్రాలు తీశారు. హైదరాబాద్ బ్లూస్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈయన తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం ఇదే తొలిసారి. 

ఇంతకూ హీరో ఎవరూ చెప్పనేలేదు కదా.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరో.. జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారట. సరైనోడు సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా ఆది నటించిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో రామ్‌చరణ్‌ సోదరుడుగా ఆది జీవించేశారు. 

ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందట. ఆది హీరో, కీర్తి సురేశ్ హీరోయిన్.. నగేశ్ కుకూనూర్ డైరక్షన్.. ఇది మామూలు కాంబినేషన్ కాదు.. మరి  సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: