మహేష్ అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ ప్రవేశించడం ఇప్పుడు సంచలన వార్తగా మారింది. ఈమూవీలో ఒక కీలక పాత్రకు రమ్యకృష్ణ ఎంపిక కావడంతో ఇప్పుడు ఇదే సినిమాలో విజయశాంతి కూడ ఉంటుందా లేదంటే విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ వచ్చిందా అన్న కోణంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే ఈసినిమాలో ఒక కీలక పాత్రకు బండ్ల గణేష్ ఎంపిక అయిన నేపధ్యంలో ఈసినిమాలో ఇలా ఎన్ని కీలక పాత్రలు ఉంటాయి అన్న చర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు ఈమూవీలో రాజేంద్రప్రసాద్ రావ్ రమేశ్ లు కూడ ఈమూవీకి ఎంపిక అయ్యారు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ఈమూవీలోని స్టార్ క్యాస్ట్ ఎవరి అంచనాలకు అందకుండా మారిపోయింది. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి అనీల్ రావిపూడి మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’ సెంటిమెంట్ ను కూడ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో కొన్ని కీలక సీన్స్ ను కర్నూల్ పట్టణంలోని కొండా రెడ్డి బురుజు దగ్గర గతంలో తీసినట్లుగా అనీల్ రావిపూడి లేటెస్ట్ మూవీలో కూడ కొండారెడ్డి బురుజు సీన్స్ ఉండబోతున్నాయి అని టాక్. 

ఇప్పుడు ఇలా మహేష్ అనీల్ రావిపూడిల సినిమా గురించి లీకులు బయటకు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ కథలో ఫ్యాక్షన్ కూడ ప్రధానపాత్ర పోషిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనితో ఈమూవీ కథ మహేష్ కెరియర్ లో ఫ్లాప్ గా మారిన ‘ఆగడు’ ఛాయలతో ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: