మెగాస్టార్ సైరా సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో ఈ సినిమా యూనిట్ బిజీ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా మార్కెట్ ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ట్ కాక‌పోయినా ఏరియాల నుంచి భారీ ఎత్తున బిజినెస్ ఆఫర్లు వ‌స్తున్నాయ్‌. నైజాం నుంచి ఓ బ‌య్య‌ర్ భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నైజాం ఏరియాకు రూ. 25 కోట్ల ఆఫ‌ర్‌ను ఓ బ‌య్య‌ర్ చెర్రీ ముందు వ‌చ్చిన‌ట్టు టాక్‌. 


హీరో నితిన్ తండ్రి సుధాక‌ర్ ఒక‌ప్పుడు నైజాంలో మంచి డిస్ట్రిబ్యూట‌ర్. ఇక త‌న బ్యాన‌ర్ మీద చాలా సినిమాలు కూడా తీశాడు. ఆ త‌ర్వాత నైజాంలో దిల్ రాజు, ఏషియ‌న్ సునీల్ హ‌వా స్టార్ట్ అవ్వ‌డంతో సుధాక‌ర్‌రెడ్డి కాస్త రేసులో వెన‌క‌ప‌డిపోయారు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రి దెబ్బ‌కు సైలెంట్‌గా ఉన్న ఆయ‌న లేటెస్ట్‌గా కాంచ‌న -3 సినిమా నైజాంలో పంపిణీ చేశారు. 


ఇక ఇప్పుడు మ‌రికొంత మందితో క‌లిసి మ‌ళ్లీ గ‌ట్టిగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలోనే సైరా హ‌క్కుల కోసం చెర్రీ ముందు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ఉంచిన‌ట్టు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు దిల్ రాజు, సునీల్ నుంచి మాత్ర‌మే కాంపిటీష‌న్ ఉంటుంది. వీరిద్ద‌రు త‌ప్పుకుండా సుధాక‌ర్‌రెడ్డికే ఈ రైట్స్ సొంతం కావ‌చ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: