కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్..హీరోగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. రజినీకాంత్ కి ఎంత మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ధనుష్ కూడా మాస్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ మద్య తెలుగు, తమిళ భాషల్లో మారీ 2 సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి నటించింది. తెలుగు లో పెద్దగా హిట్ కాకపోయినా..తమిళంలో ఈ సినిమా దుమ్మురేపింది.
ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేసిన టీం తాజాగా మరో పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ధనుష్ తలపాగా కట్టుకొని, చేతిలో కత్తి పట్టుకొని ఉన్నాడు. మొహం నిండా రక్తపు మరకలు ఉన్నాయి . ధనుష్ మాస్ లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
జీవీ ప్రకాశ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కథానాయికగా మలయాళ భామ మంజు వారియర్ని ఎంపిక చేశారు. జీవీ ప్రకాశ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కథానాయికగా మలయాళ భామ మంజు వారియర్ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ధనుష్ సత్యజ్యోతి ఫిలింస్ సంస్థలో ఓ చిత్రం, యువ దర్శకుడు రామ్కుమార్ దర్శకత్వంలోనూ ఒక చిత్రం చేయనున్నారు. త్వరలో ధనుష్ ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించబోతున్నారట..ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఎస్జే సూర్య, అదితిరావు,ధనుష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న విషయం విదితమే.