ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అత్యంత భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్డు దగ్గరలో ఉన్న పీపుల్స్ ప్లాజాలో జరగబోతోంది. ఈ ఫంక్షన్ ను రెండు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నాయి. 

వేల సంఖ్యలో మహేష్ అభిమానులు పాల్గొనే ఈ వేడుక పాస్ ల కోసం ఇప్పటికే మహేష్ అభిమానుల మధ్య మ్యానియా మొదలై పోయింది. ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు జరగబోతున్న ఈ ఈవెంట్ కు అతిధులుగా వెంకటేష్ విజయ్ దేవరకొండలు ఖరార్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

వెంకటేష్ మహేష్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం ద్వారా వెంకీ ఈ ఫంక్షన్ కు అతిధిగా వస్తుంటే అశ్వనీదత్ బ్యానర్ లో నిర్మాణం జరిగిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ద్వారా పాపులారిటీ పొందిన విజయ్ దేవరకొండ కూడ ‘మహర్షి’ ని ప్రమోట్ చేయబోతున్నాడు. అశ్వినీదత్ కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం వల్లనే ‘మహానటి’ లో కూడ విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. 

‘ఎఫ్ 2’ సక్సస్ తో గోల్డెన్ లెగ్ హీరోగా మారిపోయిన వెంకటేష్ ‘గీత గోవిందం’ తో క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండలు కలిసి ‘మహర్షి’ ని ప్రమోట్ చేస్తే ఈమూవీ మ్యానియాకు మరింత సహకరిస్తుంది అన్న ఉద్దేశ్యంతో మహేష్ తో వీరిద్దరి కలయిక జరిగే విధంగా ‘మహర్షి’ ఫంక్షన్ ను డిజైన్ చేసినట్లు టాక్. ఈసినిమా పై రకరకాల నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్న పరిస్థుతులలో వెంకీ విజయ్ ల సపోర్ట్ ‘మహర్షి’ కి చాల సహకరిస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: