తాజాగా మహేష్బాబు మహర్షి ప్రి రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. అసలే బజ్ లేదని అందరూ బాధపడుతోన్న టైంలో ఈ సినిమా కోసం పలువురు స్టార్ హీరోలు, అతిరధ మహారథులు తరలివచ్చి సినిమా ఈవెంట్ను బిగ్ సక్సెస్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాకు ఇప్పుడిప్పుడే హిట్ కళ కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాకింగ్స్టార్ దేవిశ్రీకి హీరోయిన్ పూజా హెగ్డే అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
గతంలో పూజ హీరోయిన్గా చేసిన సినిమాలకు దేవి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఆమెకు సంగీతంలో ప్రావిణ్యం ఉంది గిటార్ వాయించడం పాటలు పాడటం కూడా తెలుసట. ఈ విషయాన్ని ఈ ఫంక్షన్లో ఆమే స్వయంగా చెప్పింది. సంగీతంలో తన టాలెంట్ను దేవి ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడని... ఇకపై ఆయన ఫ్యూచర్లో అయినా తన టాలెంట్ ఉపయోగించుకుంటాని అనుకుంటున్నానని పూజా చెప్పింది.
పూజా వ్యాఖ్యలపై దేవి మాట్లాడుతూ ఇప్పటి వరకు పూజా హీరోయిన్గా చేసిన సినిమాలను తాను మ్యూజిక్ అందించినా ఆమె టాలెంట్ గురించి తెలుసుకోలేకపోయానని.. పూజాలో అంత ట్యాలెంట్ ఉందని తాను అనుకోలేని... ఫ్యూచర్లో ఆమెతో ఒక్క సాంగ్ అయినా పాడిస్తానని చెప్పాడు. ఇక సినిమాల్లో మామూలుగా సింగర్స్ పాడితే కన్నా పూజా లాంటి అందమైన హీరోయిన్ సాంగ్ పాడితే దానికుంటే క్రేజే వేరు. మరి పూజా సాంగ్ వినే అదృష్టం మనకు ఎప్పటి దేవి కలుగ చేస్తాడో..?