ఏపీ ప్రతిపక్షనేత, విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం ముగియడంతో కాస్త సేద తీరుతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ తన పెద్ద కుమార్తె విద్యాభ్యాసం చేస్తుండడంతో ఆమెను చూసేందుకు అక్కడకు వెళుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జగన్ గురువారం రాత్రి బ్లాక్బస్టర్ అవెంజర్స్ సినిమా చూశారు.
హైదరాబాద్లో ఉన్న సూపర్స్టార్ మహేష్బాబు ఎంఎంబీ మల్టీఫ్లెక్స్కు వచ్చిన జగన్ అక్కడ అవెంజర్స్ సినిమా చూశారు. ఈ సినిమా చూసేందుకు ముందుగానే జగన్ వస్తున్నట్టు మల్టీఫ్లెక్స్ నిర్వాహకులకు సమాచారం అందడంతో వారు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎంఎంబీలోని స్క్రీన్ -5లో అన్నీ రిక్లయినర్లే ఉంటాయి. అవన్నీ కూడా లిమిటెడ్ సీట్లే.
ఈ స్క్రీన్ను టోటల్గా ఓ షోకు జగన్ ఫ్యామిలీ కోసమే బ్లాక్ చేయగా ఆ ఫ్యామిలీలో కొద్ది మంది మాత్రమే వచ్చి సినిమా చూశారు. జగన్ రావడంతో మల్టీఫ్లెక్స్లో ఒక్కసారిగా హడావిడి నెలకొంది. ఈ సందర్భంగా అక్కడ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు జగన్ దగ్గరకు వెళ్లి విష్ చేసి, ఫొటోలు తీసి హడావిడి చేయకుండా మల్టీఫ్లెక్స్ సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా చూశాక జగన్ నేరుగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఆసియన్ మహేష్ బాబు మాల్ భాగస్వామి సునీల్ నారంగ్ ఈ సందర్భంగా జగన్ ను విష్ చేశారు.