'మహర్షి' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత ఈమూవీని నిర్మాతలు తమకు అత్యంత సన్నిహితులైన మిత్రులు కొందరికి ఈమూవీని గత రాత్రి చూపించి వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీని చూసిన ఆ అతికొద్దీ మంది ఈమూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని చెప్పడమే కాకుండా ఈమూవీలో హైలెట్ గా నిలిచే కొన్ని సీన్స్ గురించి ఆసినిమా చూసిన కొందరు ఈమూవీ నిర్మాతలతో తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నట్లు టాక్. 

ముఖ్యంగా ఈసినిమా తొలి భాగంలో వచ్చే హీరో క్యారెక్టరైజేషన్ అత్యంత బాగుండి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమూవీలో వచ్చే రిజిస్టార్ ఆఫీసులో రైతుల భూముల సీన్  సాయి కుమార్ మహేష్ బాబు మధ్య వచ్చే సీన్చాలా పవర్ ఫుల్ గా ఉండటమే కాకుండా ఆ సీన్స్ లో మహేష్ నటన చాలా పవర్ ఫుల్ గా వచ్చినట్లు సమాచారం. 

దీనికితోడు ఈమూవీలో విలన్ మహేష్ తో ఒక గ్రామం వదిలెయ్ అని అడిగే సీన్ లో ఉద్వేగంతో మహేష్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ కు థియేటర్లలో ఈలలు చప్పట్లు ఖాయం అని అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మహేష్ డైలాగ్స్ మహేష్ నటనను మరో స్థాయికి తీసుకువెళతాయనీ అదేవిధంగా ఈమూవీ క్లైమాక్స్ లో వచ్చే పాట అందరికీ బాగా నచ్చుతుందనీ రైతులు హీరో మహేష్ వెంట నడిచే సీన్ ఈమూవీకి హైలెట్ గా ఉంటుందనీ ఇప్పటికే ఈసినిమాను చూసిన కొందరు నిర్మాతలకు ధైర్యం చెపుతున్నట్లు సమాచారం. 

ఒక మెసేజ్ తో పూర్తి కమర్షియల్ హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈమూవీ 'రంగస్థలం' రికార్డులను బ్రేక్ చేసి ఈ సమ్మర్ రేస్ లో రియల్ బ్లాక్ బస్టర్ మూవీగా మారుతుందని ఈసినిమాను చూసిన వారి నుండి వస్తున్న లీకులతో ఒకేసారి 'మహర్షి' పై పాజిటివ్ అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో మహేష్ అభిమానులు కూడ ఫుల్ జోష్ లో ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: