రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రం  మొదట బోల్డ్ కంటెంట్ గా భావించారు.  చాలా మంది వ్యతిరేకించారు..కానీ చిత్రం చూసిన తర్వాత విలేజ్ బ్యాగ్ గ్రౌండ్ లవ్ స్టోరీగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  ఈ చిత్రంలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ కి మంచి పేరు వచ్చింది. 


దాంతో ఈ ఇద్దరికీ వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.  ముఖ్యంగా పాయల్ రాజ్ పూత్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.  తాజాగా   'వెంకీమామ' .. 'డిస్కోరాజా' తరువాత ఆమె మరో సినిమాను అంగీకరించింది. 'ఆర్ డి ఎక్స్ లవ్ ' టైటిల్ తో ఈచిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.   ఈ చిత్రం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. 


అయితే ఈ చిత్రం  'ఆర్ ఎక్స్ 100' సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జోరందుకుంది.  ఈ విషయంపై పాయల్ రాజ్ పూత్ స్పందిస్తూ.. 'ఆర్ డి ఎక్స్ లవ్ ' చిత్రానికి ఆర్ ఎక్స్ 100 చిత్రానికి ఏమాత్రం పోలిక ఉండదని..ఇది ఓ అమ్మాయి జీవితానికి సంబంధించి చిత్రం అని అన్నారు. 'ఆర్ డి ఎక్స్ లవ్ ' పూర్తిగా వేరే జోనర్లో వుంటుందని స్పష్టం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: