నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈమూవీలో పనిచేస్తున్న యూనిట్ అందరికోసం ఒక డిన్నర్ పార్టీని నాగ్ కొద్దిరోజుల క్రితం హోస్ట్ చేసాడు. ఆపార్టీకి సంబంధించిన ఫోటోలు మీడియాలో కూడ వచ్చాయి. 

అయితే ఈపార్టీని తాము ఎంజాయ్ చేశాను అంటూ రకుల్ ప్రీత్ మంచు లక్ష్మి వెన్నెల కిషోర్ లు కొద్దిరోజుల క్రితం ట్విట్ చేసారు. దీనితో ఈ పార్టీ అంతా చాల సజావుగా సరదాగా జరిగిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను వెన్నెల కిషోర్ కొంచం ఆలస్యంగా బయట పెట్టాడు. 

ఈ పార్టీకి అందరూ అనుకున్న సమయానికి వస్తే రకుల్ ప్రీత్ వెన్నెల కిషోర్ లు మాత్రం చాల ఆలస్యంగా వెళ్లారట. దీనితో నాగార్జున ఆ పార్టీకి ఆలస్యంగా వచ్చిన వారిద్దరిని చూస్తూ ‘కిషోర్ మీలాంటి డిజిటల్ వ్యసనపరులు కోసమే ఇలాంటి పార్టీ ఏర్పాటు చేశాం. కానీ మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. బీ హ్యాపీ’ అంటూ  కామెంట్ చేసాడట. దీనితో నాగ్ వైపు నుండి వచ్చిన ఈ అనుకోని కామెంట్ కు వెన్నెల కిషోర్ సమాధానం చెప్పేలోగ మంచు లక్ష్మి అసలు విషయాన్ని బయటపెట్టి రకుల్ ప్రీత్ కు షాక్ ఇచ్చిందట. 

తామిద్దరూ పార్టీ కోసం ముందుగా రెడీ అయి కూర్చున్నా తమను రూమ్ లో వదిలి పెట్టి రకుల్ ప్రీత్ తన కారులో ఏటో వెళ్లిపోవడంతో తామిద్దరం ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నామని చెపుతూ తమ ఆలస్యానికి కారణం రకుల్ ప్రీత్ పై మంచు లక్ష్మి నెట్టేసింది అని తెలుస్తోంది. దీనితో షాక్ అయిన రకుల్ ప్రీత్ మంచు లక్ష్మితో ఎదో అనబోతూ ఉంటే నాగ్ నవ్వుతూ వారిద్దరికీ సద్ది చెప్పి అందర్నీ నవ్వించిన విషయానికి సంబంధించిన న్యూస్ ను వెన్నెల కిషోర్ తన అభిమానులతో చాల ఆలస్యంగా షేర్ చేసుకున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: