‘దూకుడు’ సినిమాలో మహేష్ బాబుతో ఒక పాటలో కనిపించిన ముంబాయి బ్యూటీ మీనాక్షి దీక్షిత్ ఆతరువాత తెలుగు సినిమాల వైపు పెద్దగా చూడలేదు. అయితే ఈమె ఈవారం విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈమెను ఈపాత్ర కోసం ఏరికోరి వంశీ పైడిపల్లి ఎంచుకున్నట్లు సమాచారం.

అయితే ఈమె కోసం మహేష్ గంటలతరబడి షూటింగ్ స్పాట్ లో వెయిట్ చేసిన విషయాన్ని ఈరోజు ఒక ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి దీక్షిత్ బయటపెట్టింది. తాను మహేష్ తో నటించడానికి మొదటిరోజు షూటింగ్ కోసం ముంబాయి ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన బ్యాగ్ కనిపించక పోవడంతో ఆ బ్యాగ్ లో ఉన్న విలువైన వస్తువుల కోసం తాను ‘మహర్షి’ షూటింగ్ స్పాట్ కు వెళ్ళకుండా ఎయిర్ పోర్ట్ లో ఉండిపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది.

అయితే ఇంతకీ ఆమె బ్యాగ్ లో ఉన్న ఆ విలువైన వస్తువు ఆమె మేకప్ కిట్ మాత్రమే అని ఆలస్యంగా తెలిసినా మహేష్ ఒక్క మాట తనను అనకుండా తనతో నవ్వుతూ నటించిన విషయాలను గుర్తుకు చేసుకుంది. ఈమూవీలో మహేష్ తో ట్రావెల్ అయ్యే తన పాత్ర ఈమూవీ కథకు చాల కీలకం అని ఆమె చెపుతోంది. 

అంతేకాదు తనకు ‘మహర్షి’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు తనకు డెంగీ ఫీవర్ వచ్చి 21 రోజులు హాస్పటల్ లో ఉన్నప్పటికీ తాను కోలుకునే దాక అవకాసం ఇచ్చి ఆతరువాత తనతో నటించిన మహేష్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు అని అంటోంది మీనాక్షి దీక్షిత్. ఎప్పుడు నవ్వుతు కనిపించే మహేష్ నవ్వులో ఒక స్పెషల్ ఎనర్జీ కనిపిస్తుందనీ అదే అతడి సక్సస్ సీక్రెట్ అంటూ మీనాక్షి చెప్పిన విషయాలను ఆ ప్రముఖ పత్రిక చాల ప్రముఖంగా ప్రచురించింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: