తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయన తార ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు హర్రర్, లేడీ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తుంది.  ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. 

తాజాగా ఎం. రాజేశ్ దర్శకత్వంలో ‘మిస్టర్ లోకల్’ చిత్రంలో నటింస్తుంది.  ఈ చిత్రంలో శివకార్తికేయ హీరోగా నటిస్తున్నారు.  కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ మనోహర్‌ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీర్తన వాసుదేవన్‌ పాత్ర పోషిస్తోంది.   నెలాఖరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

కార్తికేయన్‌, నయన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’చిత్రంలో  జంట నటించి అలరించారు. ప్రస్తుతం నయనతార తెలుగు లో సైరా, తమిళంలో రజినీ సరసన ‘దర్భార్’ చిత్రాల్లో నటిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: