ఎన్నికల హడావిడి ముగిసి మరికొద్ది రోజులలో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్న నేపధ్యంలో ఎన్నికల ఫైలితాల తరువాత పవన్ వెయ్యబోయే ఎత్తుగడల గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ ను పవర్ స్టార్ గా మార్చింది సినిమాలు కాబట్టి సినిమాల నుండి పవన్ దూరం కాకుండా సినిమాలలో కొనసాగుతాడు అన్న అంచనాలు వస్తున్నాయి. 

అయితే ఇది అంతా ఎన్నికల ఫలితాలలో పవన్ ‘జనసేన’ కు వచ్చే స్థానాల బట్టి పవన్ ఆలోచనలు ఉంటాయి అని అంటున్నారు. ఇలాంటి వార్తల మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నుండి ఇండస్ట్రీకి వస్తున్న లీకులు ప్రస్తుతం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఈ ఏడాది చివరి నుండి పవన్ మైత్రీ మూవీస్ నిర్మించబోయే ఒక పవర్ ఫుల్ సబ్జక్ట్ లో హీరోగా నటించడానికి 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వడానికి పవన్ సూత్ర ప్రాయంగా అంగీకరించాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికితోడు ఈసినిమా నిమిత్తం పవన్ కు 30 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారు అన్న వార్తల హడావిడి కూడ మొదలైపోయింది. 

అయితే ఈమూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న విషయమై మైత్రీ మూవీస్ సంస్థ పూర్తిగా రహస్యాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో పవన్ అభిమానులు జోష్ లో ఉన్నారు. అంతేకాదు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా తిరిగి తమ పవర్ స్టార్ సినిమాల వైపు యూటర్న్ తీసుకుంటున్నాడు అని వార్తలు గుప్పుమనడం ఎన్నికల ఫలితాలు వెలువడే నెలలోనే రావడం పవన్ స్టామినాకు నిదర్శనం అంటూ పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: