మళయాళ బ్యూటీ నిత్యామీనన్ కు రాజ్ తరుణ్ కు మధ్య ప్రేమ చిగురించే ఆస్కారమే లేదు. దీనికి తోడు నిత్యామీనన్ రాజ్ తరుణ్ కన్నా వయసులో పెద్దది మాత్రమే కాకుండా ఇమేజ్ విషయంలో కూడ నిత్యామీనన్ రాజ్ తరుణ్ కన్నా చాలా పెద్ద స్థాయిలో కొనసాగుతున్న క్రేజీ హీరోయిన్. ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరూ ఒక సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించబోతున్నారు. 

‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ గతంలో నాగచైతన్యతో తీసిన 'ఒకలైలా కోసం' మూవీ ఫ్లాప్ అయిన తరువాత ఈ దర్శకుడుకి అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో  ఈ దర్శకుడు లేటెస్ట్ గా మొదలు పెట్టబోతున్న ఒక మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ కుమార్ కొండ త్వరలో ఒక వెరైటీ లవ్ స్టోరీని మూవీగా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తే హీరోగా రాజ్ తరుణ్ నటించబోతున్నాడు. ఈమూవీ కథ రీత్యా కూడ హీరో కన్నా హీరోయిన్ వయసులో పెద్దదిగా ఉంటుంది. 

ఈ వెరైటీ కథ నిత్యామీనన్ కు నచ్చడంతో వెంటనే ఈమూవీ ప్రాజెక్ట్ కు ఆమె ఓకె చెప్పినట్లు టాక్. వాస్తవానికి ఈమూవీ కథ వెరైటీగా కనిపించినా నిత్యామీనన్ రాజ్ తరుణ్ ల జంటను సగటు ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. గత కొంత కాలంగా చేతిలో
సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కు నిత్యామీనన్ ఎంట్రీ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: