టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తాజా సినిమా మ‌హ‌ర్షి గురువారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ల్యాగ్ అయ్యింద‌న్న కంప్లెంట్ ఉన్నా క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగిపోయారు. భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మ‌హేష్‌కు వ‌రుస‌గా రెండో హిట్ రావ‌డంతో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్‌కు మ‌రో పండ‌గ లాంటి వార్త అప్పుడే వ‌చ్చేసింది.


మ‌హ‌ర్షి సినిమాకు హిట్ టాక్‌తో ప‌లువురు ప్ర‌ముఖులు మహేష్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఈ ప్ర‌శంస‌ల జల్లులో ఉన్న మ‌హేష్ త‌న నెక్ట్స్ సినిమాపై అప్పుడే దృష్టి పెట్టేశాడు. ఈ వారం సినిమా ప్ర‌మోష‌న్ల త‌ర్వాత త‌న 26వ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇటీవ‌ల ఎఫ్ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమాలో హీరోయిన్‌, ఇత‌ర టీంను సెల‌క్ట్ చేసుకుని  జూన్ 15న సినిమాని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ ని అదే రోజు నుంచి కంటిన్యూ చేస్తారని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్‌, లేడీ అమితాబ‌చ్చ‌న్ విజ‌య‌శాంతి మ‌హేష్‌కు అత్త పాత్ర‌లో న‌టిస్తార‌ని టాక్‌. ఇక న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఓ క‌మెడియ‌న్ రోల్‌లో న‌టిస్తుండ‌గా... ర‌ష్మిక మంద‌న్నా ఓ హీరోయిన్‌గా సెల‌క్ట్ అయిన‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: