జై సింహ హిట్ తరువాత వచ్చిన ఎన్టిఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. అలా దాని సీక్వెల్ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది . ఈ చిత్రం క్రిటిక్స్ దగ్గర మార్కులు సంపాదించిన ఆడియన్స్ మాత్రం కన్విన్సు కాలేదు. బాలకృష్ణ తన పాత్రను సమర్దవంతంగా చేసారు అన్న అభిప్రాయం ఉన్నా, బయోపిక్ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. దీనికి ఒకానొక కారణం సినిమా ప్రమోషన్లు సరిగ్గా లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా సి.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కే.ఎస్. రవికుమార్ దర్సకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఒక పెద్ద చిత్రాన్ని భారీ ఎత్తున చిత్రీకరించాలని నిర్ణయించారు. ‘జై. ఈ చిత్రం లో సింహ’ వంటి సూపర్ హిట్ సినిమా కాంబినేషన్ లోనే ఈ సినిమా రూపొందుతుంది. నరసింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కే/ఎస్.రవికుమార్ దర్సకత్వం లో తొలిసారిగా బాలయ్య బాబు ఈ సినిమాను చేస్తున్నారు.

Image result for bala krishna images

ఈ చిత్రానికి ఏం.రత్నం అద్బుతమైన కధ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఏది మొరో గొప్ప చిత్రం అవ్వబోతుందని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రం జూలై 10నుండి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో లేడీ విలన్ గా ప్రముఖ తమిళ్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి నటించబోతున్నట్లు తెలుస్తుంది. వరలక్ష్మి చాలా సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


జగపతి బాబు కూడా విలన్ పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు విలన్ గా చేసిన బాలకృష్ణ లెజెండ్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకుడు సిరంతాన్ భట్ సంగీత సారద్యం వహిస్తున్నారు. మొత్తానికి బాలయ్యబాబు సినిమా పెద్ద ఎత్తున సన్నద్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: