గత కొన్ని రోజులు నుండి మహర్షి సినిమా టీజర్, ట్రైలర్స్ తో అదరగొట్టి, సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసి ఆహా అనిపించుకుంటుంది. సామజిక మాధ్యమాల్లోను, టీవీలోను, బయట అందరి నోటా మహర్షి మాటే. మహేష్ 25వ చిత్రం కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిమానులు, సెలేబ్రిటిలు కుడా మహేష్ మహర్షి సినిమా కోసమే టాక్. ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ ను అందుకుంది మరి. మహేష్ నటన అల్లరి నరేష్ క్యారెక్టర్ అందరిని ఆకట్టుకున్నాయి.


బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సెలబ్రిటీస్ అందరు మహర్షి టీంను ముఖ్యంగా మహేష్, వంశి పైడిపల్లిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. రిలీజ్ కాకముందు కూడా మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా వీడియో బైట్ లు చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, మహర్షి డైరెక్టర్ వంశీకి ఫోన్ చేసి అభినందిచారంట. ముఖ్యంగా రైతుల గురించి సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ మెగా స్టార్ కి బాగా కనెక్ట్ అయిందని తెలిపారట.

Image result for maharshi images

సక్సెస్ మీట్ లో వంశి మాట్లాడుతూ “ఈరోజు మార్నింగ్ నాకు ఒక తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఒక్క నిమిషం అటువైపు నుండి వాయిస్ విని ఓళ్ళు పులకరించింది, అది మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. 5నిమిషాల పాటు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో మర్చిపోలేనిది. చిరంజీవి గారు తన నెంబర్ ను సేవ్ చేసుకోమని చెప్పారు, అది నేను ఎన్నటికి మర్చిపోలేనిది” అని తన మనసులో మాటని పంచుకున్నారు.


మహర్షి టీం ప్రస్తుతానికి సంబరాలలో మునిగి తేలుతుంది. ఈ సందర్భంగా వంశి మాట్లాడుతూ క్రిటిక్స్ రకరకాలుగా రివ్యూస్ ఇచ్చారని కొన్ని పాజిటివ్ గా మరికొన్ని అత్యంత నెగటివ్ గా ఉన్నాయని, కానీ నేను రెండిటిని సమానంగా తీసుకున్నా అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: