బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలు ఎక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల త‌ర్వాత బాల‌య్య బోయపాటితో కమిట్ అవ్వాల్సింది కాస్తా కేఎస్‌.ర‌వికుమార్‌తో కమిట్ అయ్యాడు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జై సింహా యావ‌రేజ్ మార్కులు వేయించుకుంది. సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా అజ్ఞాత‌వాసి అట్ట‌ర్‌ప్లాప్‌తో హిట్ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు తెచ్చుకుంది.


ఇక ఇప్పుడు మ‌ళ్లీ బాల‌య్య మ‌రోసారి బోయ‌పాటి కంటే కేఎస్‌.ర‌వికుమార్‌కే ఓటేశాడు. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడ‌తారా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఇక తాజాగా ఈ రోజు చాంబ‌ర్‌లో సీ క‌ళ్యాణ్ రూర‌ల్ అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయ‌డంతో ఈ సినిమాకు రూల‌ర్ టైటిల్ పెడుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అప్పుడే ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. 


రూల‌ర్‌లో జైసింహాలో బాల‌య్య ప‌క్క‌న న‌టించిన హ‌రిప్రియ ఓ హీరోయిన్‌. ఇక త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ లేడీ విల‌న్ అంటున్నారు. జ‌గ‌ప‌తిబాబు మెయిన్ విల‌న్‌గా ఎంపిక‌య్యాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏక‌ధాటిగా జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ యేడాదే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాతే బాల‌య్య - బోయపాటి సినిమా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: