మహేశ్ బాబు తన మహర్షి సినిమా ప్రమోషన్ భలేగా కానిచ్చేస్తున్నాడు. సినిమా కాస్త నిడివి ఎక్కువగా ఉన్నా ఓవరాల్ గా బావుందని టాక్ రావడంతో వసూళ్లు ఫుల్ గా ఉన్నాయి.  దీనికితోడు బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలు కూడా పోటీలో లేవు.


అందుకే మహర్షి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను మహేశ్ బాబు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కోసం ఓ షో వేసి చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ కోసం యూనిట్ స్పెష‌ల్ షో అరేంజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మ‌హ‌ర్షి సినిమాను చిరంజీవి చూసి సూపర్ అంటూ ప్రశంసించారు. 

ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతు అన్నమాట. పవన్ కల్యాణ్ వ్యవసాయం అంటే చాలా  ఇంట్రస్ట్ అన్న సంగతి తెలిసిందే. ఆయన స్వయంగా ఫామ్ హౌజ్ వద్ద వ్యవసాయం చేస్తారు కూడా. వీకెండ్ వ్యవసాయం కాన్పెప్టుతో వచ్చిన మహర్షిని పవన్ సపోర్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇప్పటికే మహర్షి మూడు రోజుల్లోనే 80 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది. చాలా మంది ప్రముఖులు పొగిడేశారు. మహేశ్ బాబు కెరీర్‌లో బిగ్ గ్రాసర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: