మహేష్ ఎప్పుడు లేనివిధంగా జనం మధ్య చూపెడుతున్న బాడీ లాంగ్వేజ్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘మహర్షి’ విడుదలైన తరువాత జరిగిన సక్సస్ మీట్ లో మహేష్ మాట్లాడుతూ తన మాటల మధ్య కాలర్ ఎగరవేసాడు. ఆవిషయం అప్పట్లో మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా మహేష్ అత్యుత్సాహం పై నెగిటివ్ కామెంట్స్ కూడ వచ్చాయి. 

అయితే ఆ కామెంట్స్ ను మహేష్ లెక్కచేయకుండా తన కొత్త పద్ధతి కొనసాగించబోతున్నాడా అన్న సందేహాలు నిన్నతిరోజున జరిగిన మరో సంఘటన ఆలోచనలను రేకెత్తిస్తోంది. ‘మహర్షి’ సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి మహేష్ నిన్నటి నుంచి ఆసినిమా ప్రదర్శింప బడుతున్న ధియేటర్ల బాట పట్టాడు. 

ఈ వ్యూహంలో భాగంగా నిన్న సాయంత్రం మహేష్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌ వద్దకు వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చుని ఈసినిమాను చూడటమే కాకుండా మధ్యలో మైక్ తీసుకుని ప్రేక్షకులతో మాట్లాడటంతో ధియేటర్ అంతా చప్పట్లు ఈలలతో దద్దరిల్లి పోయింది. మహేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ ఈసినిమా ఘన విజయం చూసిన తరువాత తాను మరొకసారి కాలర్ ఎగరవేయకుండా ఉండలేకపోతున్నానని అంటూ జనం మధ్య మరొకసారి కాలర్ ఎగరవేసాడు. 

దీనితో మహేష్ మార్చుకున్న అలవాట్ల పై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతూ మహేష్ బాబు కాలర్ బాబుగా మారిపోయాడ అంటూ విపరీతంగా జోక్స్ పడుతున్నాయి. సాధారణంగా గొప్పలకు ఇగో లకు దూరంగా ఉండే మహేష్ ప్రవర్తనలో వచ్చిన ఈమార్పును చూసి అతడి సన్నిహితులు కూడ ఆశ్చర్యపడుతున్నట్లు టాక్. దీనితో ఇది అంతా ‘మహర్షి’ 200 కోట్ల కలక్షన్స్ కోసం జరుగుతున్న ప్రయత్నాలలో ఒక భాగం అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: